Jul 24,2021 18:20

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,174 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 19,49,618కి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే ఈ మహమ్మారి వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,214కి చేరుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,737 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 19,08,917కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 74,820 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,40,50,103కి చేరుకుంది. ప్రస్తుతం 22,358 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.