జైపూర్ : రాజస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. రాజస్తాన్లోని బికనీర్కు సమీపంలో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాజస్తాన్లోని బికనీర్కు 343 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.










