హైదరాబాద్ : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. నిర్మాత దగ్గుబాటి సరేష్బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్, డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా నటింబోతున్నారు. ఈ సినిమాలో అభిరామ్.. విలక్షణ నటుడు సముద్రఖనితో తలపడనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో సముద్రఖనిని నటించమని చిత్రయూనిట్ ఇటీవల అతనితో చర్చలు జరిపిందట. ఆ పాత్ర చేయడానికి ఆయన కూడా ఒప్పుకున్నారని.. ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని అందివ్వనున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన 'చిత్రం' మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరలా ఈ కాంబినేషన్లో రానున్న చిత్రం మ్యూజికల్ హిట్నందిస్తున్నదనే అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీకి చిత్రయూనిట్ 'అహింస' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్పై సురేష్బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.