Nov 20,2023 11:56

న్యూఢిల్లీ :   మణిపూర్‌ను సందర్శించడం ప్రధాని షెడ్యూల్‌లోనే లేదని కాంగ్రెస్‌ ఆదివారం  ధ్వజమెత్తింది. అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు ప్రధానికి సమయం దొరికింది కానీ, ఇప్పటికీ మణిపూర్‌లో సందర్శించలేదని కాంగ్రెస్‌ మండిపడింది. దీంతో ప్రధాని మోడీ ప్రాధాన్యతల గురించి స్పష్టమైందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేశారు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ కోసం ఆదివారం గుజరాత్‌ వెళ్లారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్తాన్‌లలో కాంగ్రెస్‌ ప్రతిష్టను దెబ్బతీయడం ప్రారంభిస్తారు. కానీ ఇప్పటికీ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో సందర్శించడం మాత్రం ఆయన షెడ్యూల్‌లో లేదని, దానికి ప్రాధాన్యతనివ్వలేదని విమర్శించారు.