Jul 24,2021 17:27

శ్రీశైలం (కర్నూలు) : ఎగువ రాష్ట్రాల్లోనూ, రాష్ట్రంలోనూ కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో వరద నీటి తాకిడికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఆలయ గోపురం వరకు నీరు చేరింది. దీంతో ఆలయ పూజారి శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరింది.