Jul 24,2021 10:11

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం ఒక సైనికుడు మందుపాతర పేలడంతో ఒక సైనికుడు మరణించాడు. అంతర్జాతీయ సరిహద్దు రేఖ (ఎల్‌ఒసి) లోని ఫూంచ్‌ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టారు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సరిహద్దుల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సైనికుడు మందుపాతరపై కాలు వేయడంతో అదిపేలిందని, దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుడు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని హమీర్‌ పూర్‌ గ్రామానికి చెందిన కృష్ణ వైద్యగా గుర్తించామని అన్నారు. కృష్ణవైద్యకు భారత సైనికులు నివాళులు అర్పించారు. కాగా, కృష్ణ ఘాటీ సెక్టారులో పిఐఎ మార్కుతో ఉన్న ఒక  డమ్మీ విమానం బెలూన్‌ను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి నుండి జమ్ముకాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్తాన్‌లలో  ఏడు  విమానం ఆకారఫు బెలూన్‌లు  లభ్యం కావడం గమనార్హం.