Jul 24,2021 08:53

రాజమండ్రి (తూర్పు గోదావరి) : ధవళేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 5.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 175 గేట్లను అధికారులు ఎత్తి సముద్రంలోకి 3.26 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డెల్టాలకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.