Jul 25,2021 18:54

చిత్తూరు : టిడిపి అధినేత చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరవు ప్రాంతానికి తాగు, సాగు నీరు రాకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు రావడాన్ని ఓర్వలేకపోతున్నారని అన్నారు. టిడిపి కార్యకర్తలతో చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని, అయినా తమ ప్రభుత్వం తాగు, సాగు నీరు అందించి తీరుతుందని పేర్కొన్నారు.