మాట్లాడుతున్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి
ఆస్కార్ అవార్డు నటుడు జగన్
కొడవలూరు:తొలిసారి శాసనసభ్యులు అయి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు కు హదయ పూర్వక శుభాకాంక్షలు.సొంత బాబారు హత్యని రాజకీయం చేసిన ఆస్కార్ అవార్డు నటుడు జగన్ రెడ్డి
హత్యారాజకియాలే పునాదులుగా అధికారం దక్కించుకున్న వారి పాలనలో ప్రజలు సంతోషంగా ఉండగలరాచట్టాలు,వ్యవస్థల కేవలం వైకాపా పార్టీ నాయకుల కోసమైనా వివేకానంద రెడ్డి హంతకులకు శిక్ష పడాలి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్కొన్నారు
కొడవలూరు మండల తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో పి.ఎస్. ఆర్ కళ్యాణ మడపంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుత్మ్నూందుగా శాసన సభ్యులు గా తొలిసారి గెలిచి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూ శుభాకాంక్షలు తెలియచేశారు.
గడిచిన నాలుగేళ్లుగా నడుస్తున్న వివేకానంద రెడీ హత్య కేసు అనేక మలుపులు తిరిగి నేడు నేరుగా జగన్మోహన్ రెడ్డి పాలస్ లో ఆధారాలతో సహా నిరూపితం కావడానికి సిద్దంగా ఉండటం జగన్మోహన్ రెడ్డి నాటకీయ హత్యా రాజకీయాలకు నిదర్శనం అని తెలిపారు.వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పిన సినిమా కథ నేడు వింటే ఇంత నమ్మకంగా ఒక కట్టుకథ అది స్వయాన చిన్నాన్న విషయంలో చెప్పడం చూస్తే రాజకీయం కోసం ఎంత దారుణానికి అయినా తెగిస్తారు అనేది అర్దం అవుతుంది అని తెలిపారుఅవినాష్ రెడ్డి ఎంపి. పదవి కోసం సొంత బాబారు నీ అత్యంత కిరాతంకా చంపితే అందుకు సీబీఐ ఆధారాలతో సహా చెప్తుంటే ఇప్పటికీ తాడేపల్లి పాలస్ నుండి ఒక్క సమాధానం కూడా రాకపోవడం చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి మానసిక పరిస్థతి మీద అనుమానం వస్తోంది అని తెలిపారు
ఇటువంటి నాయకులు పాలన చేస్తుంటే ప్రజల హక్కులు,స్వేచ్చ,అధికారాలు,ఆస్తులు కూడా కల్పోవలసి ఉంటుంది అని ప్రజలు గుర్తించాలి అని ఇలాంటి పాలకులను గద్దె దించాలని పిలుపునిచ్చారువివేకానంద రెడ్డి హత్యకేసులో ఉన్న నిజమైన హంతకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని లేని పక్షంలో రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర చెముకుల కష్ణ చైతన్య సర్పంచ్ బుచ్చిరెడ్డి గోపి రమణయ్య రమేష్ వినీల్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










