May 02,2023 20:24

అనిబిసెంట్‌ విశ్వవిద్యాలయంగా బిటి కళాశాల


సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : మదనపల్లి పరిసర ప్రాంతాల వారి దశాబ్దాల కల రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌ బాషా ద్వారా నెరవేరింది. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కలిసి బిటి కళాశాలను డాక్టర్‌ అనిబిసెంట్‌ విశ్వవిద్యాలయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
- సిఎం జగన్‌ను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే