హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల (టిఎస్ఆర్జెసి) ప్రవేశ పరీక్షను ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల ముందు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ ఎంపిసి, బైపిసి, ఎంఇసి ఆంగ్లమాధ్యమం మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టిఎస్ఆర్జెసి సెట్ను నిర్వహిస్తారని తెలిపారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పూర్కొన్నారు. ఆగస్టు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుందని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను సంస్థ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.