May 30,2023 21:24

15 మందితో నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌:
అఖిల భారత పోస్టల్‌ ఉద్యోగుల సంఘం (ఎఐపిఇయు-పి4) పోస్ట్‌మెన్‌, ఎంటిఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ అధ్యక్షులుగా ఎకె.మురళి, కార్యదర్శిగా సిహెచ్‌.విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలులోని బిఎఎస్‌ కల్యాణ మండపంలోగల ఎన్‌ఎస్‌ మూర్తి సభా ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగిన ఈ యూనియన్‌ 3వ ద్వైవార్షిక రాష్ట్ర మహాసభ మంగళవారంతో ముగిసింది. 15 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఈశ్వరయ్య, కోశాధికారిగా డి.శ్రీలక్ష్మి ఎన్నుకోబడ్డారు. ఆ సంఘం ఆలిండియా జనరల్‌ సెక్రెటరీ మొహంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.