Oct 22,2023 17:42

ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు) : డెంగ్యూ జ్వరంకు తోడు మెదడు వాపుతో బాలుడు మతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని టి.గంగన్న గూడెం పంచాయితిలోని దిబ్బ గూడెం గ్రామానికి చెందిన డి.సుహస్‌ చంద్‌ (12), శ్రీ చైతన్య స్కూల్‌లో 7 వ తరగతి చదువుతున్నాడు. అయితే గత వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతుండటంతో జంగారెడ్డిగూడెంలోనీ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించగా తగ్గకపోవడంతో పరీక్షలు చేయించగా డెంగ్యూగా నిర్ధారణ కావడంతో పాటు మెదడు వాపు కూడ తోడవడంతో రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. అక్కడ కూడ తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని రెయిన్‌ బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున మతి చెందినట్లు తెలిపారు. కాగ బాలుడి తండ్రి టి.నర్సాపురం మండలం లో వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాడు. అయితే వృత్తి రీత్యా గత కొన్ని సంవత్సరాలుగా జంగారెడ్డి గూడెం లో నివాసం వుంటున్నారు. చక్కగా చదువుకునే వయసులో ఉన్న బాలుడి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.