Jul 25,2021 18:25

అమరావతి : ఎపిలో గత కొన్నిరోజుల కిందట కరోనా రోజువారీ కేసులు 2 వేలకు లోపే నమోదయ్యాయి. అయితే, పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,252 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 385 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 316, నెల్లూరు జిల్లాలో 269, ప్రకాశం జిల్లాలో 241, పశ్చిమ గోదావరి జిల్లాలో 222 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 27 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,440 మంది కరోనా నుంచి కోలుకోగా.. 15 మంది మృతిచెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 13,256 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,54,765 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 19,19,354 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 22,155 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.