Dec 08,2020 12:06

విజయవాడ (వన్‌టౌన్‌) : అభిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (న్యూ), ఎఐఎఫ్‌టియు ఆధ్వర్యాన విజయవాడ వన్‌టౌన్‌లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఒపిడిఆర్‌ ఆర్గనైజర్‌ రాజ్యలక్ష్మి, పిడిఎస్‌ఒ నాయకులు భాను శ్రీ, రైతు కూలీ సంఘం నాయకులు వీరబాబు, తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు. పలుచోట్ల దుకాణాలను మూయించారు. రైతు సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని వ్యాపారులను కోరారు.