విశాఖపట్నం (డుంబ్రిగుడ) : విశాఖ జిల్లా దుంబ్రిగుడ మండలంలో తెల్లవారుజామున నుంచే బంద్ను చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల భారత్ బంద్ పిలుపులో భాగంగా మండలంలో నిరసన చేపట్టారు. ఈ బంద్లో అఖిలపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. షాపులు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు, అధికారులు బంద్కు సహకరించారు. బంద్ కారణంగా మండల కేంద్రమైన దుంబ్రిగుడ నిర్మానుష్యంగా మారింది.