- శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్
ప్రజాశక్తి-తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మౌత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు. వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నశేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. కాగా తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఇస్తికఫాల్ మర్యాదతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. ఆ తర్వాత దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలను అందజేశారు.










