Nov 13,2023 08:18

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు. సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రధాని మోడీ ప్రతి ఏడాది దీపావళి రోజున సైనిక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

'' మన ధైర్యవంతులైన భద్రతా దళాలతో దీపావళి జరుపుకునేందేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నాను '' అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు.   తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. గతేడాది కార్గిల్‌లో వేడుకలు జరుపుకున్నారు.

ప్రజలకు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ రోజున ప్రజలందరికి ఆనందం, సమృద్ధి మరియు ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.