Nov 20,2023 07:57

న్యూఢిల్లీ   :   వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీ పడుతున్న భారత జట్టుకు ప్రధాని మోడీ   ఆల్‌దిబెస్ట్‌  చెప్పారు.  ''140 కోట్ల మంది భారతీయులు మీవెంటే ఉన్నారు. బాగా ఆడండి, క్రీడా స్ఫూర్తిని నిలబెట్టండి' అని ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేశారు.  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌లు అహ్మదాబాద్‌ చేరుకున్నారు.