ఫొటో : పెరటి కోళ్లను పంపిణీ చేసిన ఎపిఎం బుజ్జమ్మ
పెరటి కోళ్లు పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక వైస్ఆర్ క్రాంతి పథం కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఎపిఎం బుజ్జమ్మ పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారిత కార్యక్రమంలో భాగంగా మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకునేందుకు, ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ప్రభుత్వం పెరటి కోళ్ల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మండలానికి 100 యూనిట్లు రాగా 100మంది లబ్ధిదారులకు 10కోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా హెచ్డి యాంకర్ పర్సన్ సుబ్బరాజు, సిసిలు, అకౌంటెంట్ జరింతాజ్ విఒఎలు పాల్గొన్నారు.










