Dec 22,2022 07:59

హైదరాబాద్‌ : మహవీర్‌ గ్రూపులో భాగమైన ఆదిశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియాకు చెందిన మల్టీ బ్రాండ్‌ ప్రీమియం బైకులను విక్రయించే 'మోటో వాల్ట్‌' తన నూతన షోరూంను రాజమండ్రిలో తెరిచినట్లు ప్రకటించింది. ఇందులో మూడు సూపర్‌ బైకు బ్రాండ్‌లకు చెందిన పలు ద్విచక్ర వాహనాలను విక్రయానికి ఉంచామని ఆదిశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా ఎండి వికాస్‌ ఝబక్‌ తెలిపారు.