విజయవాడ : రాష్ట్రంలో మున్సిపల్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, స్కూల్ స్వీపర్స్, పర్మినెంట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం విజయవాడలోని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తో క్యాంపు కార్యాలయంలో ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సిఐటియు రాష్ట్ర ప్రతినిధి వర్గం చర్చలు నిర్వహించింది. అనంతరం నేతలు వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు జి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామచంద్రరావు, ఎం.డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.