ప్రజాశక్తి-రాజాం (విజయనగరం జిల్లా) :ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉందని వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాంలో రూ.1.48 కోట్లతో 1.42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్తో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బత్స విలేకరులతో మాట్లాడుతూ.. వలంటీర్ల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగా, సంస్థాగతంగా ఉండాలే తప్ప, ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు తగంన్నారు.