Nov 20,2023 22:46

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కారించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కృతికా శుక్లా, జెసి ఎస్‌.ఇలక్కియా, డిఆర్‌డిఒ కె.శ్రీధర్‌ రెడ్డి, జెడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, సివిల్‌ సప్లై డిఎం డి.పుష్పమణి, డిఎల్‌డిఒ పి.నారాయణ మూర్తితో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 352 అర్జీలు వచ్చాయి.