Feb 10,2021 13:38

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు వింత వ్యాధిపై అధ్యయనం చేసిన మల్టీ డిసిప్లినరీ కమిటీ సిఫార్సుల అమలుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతఅత్వంలో వివిధ శాఖలకు చెందిన 9 మంది కార్యదర్శులకు కమిటీలో చోటు కల్పించింది. కాలుష్య నివారణ, తాగు సాగు నీటిలో కలిసే వ్యర్థాల నియంత్రణపై వివిధ శాఖలు సిద్ధం చేసిన కార్యచరణ ప్రణాళికను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. నీరు, ఆహారం, గాలి, మట్టి, వ్యవసాయం, ఆక్వా వ్యర్థాల పర్యవేక్షణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. ఈ హైలెవల్‌ కమిటీని నెలకు కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని ప్రభుత్వం ఆదేశించింది.