Nov 17,2023 14:12

ప్రజాశక్తి-పార్వతీపురం : పోరాట యోధుడు శంకరయ్య మరణం కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు, అతను ఆశయాలు కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. ఈరోజు పార్వతీపురం మండలం అడ్డాపు శీల పంచాయతీ బంటువానివలసలో జరిగిన సంతాప సభలో శంకరయ్య ఫోటోకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, రైతు నాయకులు బంటు దాసు పూలదండ వేసారు, అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ శంకరయ్య డిగ్రీ చదువుతూ విద్యార్థి దశలోనే బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా పోట్లాడి జైలుకు వెళ్లిననేత, స్వాతంత్ర సమరయోధులు, 102 సంవత్సరాలు శతాబ్ది యోధులు, రైతు ప్రజా పోరాటాల, సామాజిక ఉద్యమ నాయకులు సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు, తమిళనాడు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత కిసాన్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా రైతాంగ ఉద్యమాన్ని నడిపిన సమరశీల పోరాట యోధులు శంకరయ్య గారి పోరాట స్ఫూర్తితో జిల్లాలో మన ప్రాంతంలో రైతు, కార్మిక ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అతని ఆశయ సాధనకు అందరూ సన్నద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిరా సిపిఎం సభ్యులు, రైతు సంఘం, నిర్వాసితుల సంఘం,యువజన సంఘం నాయకులు బంటు ఆదినారాయణ, ఏ.కూర్మయ్య, బంటు విజయ్, సిహెచ్ శ్రీరాము శివుని నాయుడు, శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.