
ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం) : పట్టణంలోని మడకశిర రోడ్డులో మెడికల్ కళాశాల ముందు పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను పోలీసులు శుక్రవారం తొలగించారు. గత ఐదు రోజులు నుండి ఇళ్ల స్థలాలు లేని ప్రజలంతా కలిసి ... వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం పోలీసులు బలవంతంగా ఆ గుడిసెలను తొలగించారు.