Nov 01,2023 11:07

గార్లదిన్నె (అనంతపురం) : పేదలను కులం పేరుతో దూషించి, వారి ఇండ్లను దౌర్జన్యంగా పోలీసులు కూల్చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో జరిగింది. కల్లూరు గ్రామంలోని పేదలు గుడిసెలు వేసుకొని 4 సంవత్సరాలయ్యింది. ఈ గుడిసెల పై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ పోలీసులు దౌర్జన్యంగా ఈరోజు తెల్లవారుజామున జెసిబిలతో ఇండ్లను నేలమట్టం చేశారు. ఇటుకలపల్లి సిఐ వై.నరేంద్ర రెడ్డి పేదలను కులం పేరుతో దూషించి, దౌర్జన్యం చేశారు. కట్టుబట్టలతో నడిరోడ్డున పడిన పేదలంతా కన్నీటిపర్యంతమయ్యారు. తమ గుడిసెలపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ... పోలీసులు అకస్మాత్తుగా తెల్లవారుజామున జెసిబిలతో వచ్చి దౌర్జన్యంగా ఇండ్లను నేలమట్టం చేశారని వాపోయారు.