
అనంతపురం : హైదరాబాద్ కిడ్నాపర్లకు అనంతపురం పోలీసులు చెక్పెట్టారు. డెంటిస్ట్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి అనంతపురం జిల్లా పోలీసులు రక్షించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలోని దంత వైద్యుడు హుస్సేన్ ను కిడ్నాపర్లు మంగళవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన ఎస్పీ సత్యయేసుబాబు అనంతపురం జిల్లాలోని అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలో.. అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తున్న కిడ్నాప్ గ్యాంగ్ను పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరు దుండగులు పరారవ్వగా, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ హుస్సేన్ ను పోలీసులు రక్షించారు. ప్రస్తుతం ఇద్దరు కిడ్నాపర్లు రాప్తాడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.