Oct 29,2023 16:21

రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో బీజేపీకి వరుసగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా నిన్న బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్న వివేక్‌.. రేవంత్‌ రెడ్డి తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.గత కొద్ది రోజులుగా వివేక్‌ పార్టీ మారతారని ప్రచారం జరిగినా దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి అపాయిమెంట్‌ ఇవ్వడం, స్వయంగా కలుసుకోవడం చర్చలు జరపడం ఈ పరిణామాలు పార్టీ మారుతాయి అన్న వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. మరో సీనియర్‌ నాయకురాలు విజయశాంతి కూడా పోటీకి దూరం అని చెప్పుకోవడం వెనుక అంతరార్థం మరోలా ఉంటుందన్నది ప్రచారంలో ఉంది. వరుస చేరికలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌.. కీలక నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.