Nov 04,2023 16:01

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. శనివారం సాయంత్రం నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. రెండ్రోజుల్లో చంద్రబాబు ఎల్వీపీఈఐలో నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం.