Nov 01,2023 14:40

కామారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలీసులు, ఎన్నికల అధికారులు విస్త్రుతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర వాటిని తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు, సొత్తును స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కాన్వారు ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ కామారెడ్డిలో పార్టీ కార్యక్రమంలో పాల్గనేందుకు కాన్వారు గా వెళ్తున్నారు. మెదక్‌ జిల్లా తుప్రాన్‌ వద్ద మంత్రి కాన్వారు ను పోలీసులు నిలిపివేశారు. అనంతరం పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి వాహనాన్ని, కాన్వారు లోని ఇతర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి, సిబ్బంది పూర్తిగా సహకరించారు. తనిఖీ పూర్తయిన అనంతరం మంత్రి కేటీఆర్‌ కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు.