Nov 18,2022 21:22

హైదరాబాద్‌ : రియల్‌ ఎస్టేట్‌ సంస్థ జీస్క్వేర్‌ తమ బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని నియమించుకుంది. ఎంఎస్‌ ధోనీ భాగస్వామ్యంతో దక్షిణాదిలోని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నరు, కోయంబత్తూరులలో మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు తాము 60కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేశామని జీస్క్వేర్‌ హౌసింగ్‌ సిఇఒ ఈశ్వర్‌ ఎన్‌ తెలిపారు. దోనితో భాగస్వామ్యం తమ వ్యాపారాన్ని ప్రాంతాల వ్యాప్తంగా విస్తరించడానికి, బ్రాండ్‌ బలోపేతానికి దోహదం చేయనుందన్నారు.