Nov 10,2023 12:55

ప్రజాశక్తి-అయినవిల్లి (కోనసీమ) : సంక్షేమ పథకాలు అమలు పారదర్శకంగా వ్యవహరిస్తూ జగనన్న ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమారుడు వికాస్‌ అన్నారు. వీరవల్లి పాలెంలో మండల వైసిపి అధ్యక్షులు కుడిపూడి విద్యాసాగర్‌ అధ్యక్షతన జరిగిన జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కుమారుడు పాల్గన్నారు. ఈ సందర్భంగా వికాస్‌ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. అంతే కాకుండా గ్రామాలలో కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కె దక్కుతుందన్నారు. అనంతరం గ్రామంలో సంక్షేమ పథకాలు డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటా చార్యులు, సర్పంచులు కుసుమల్లి మంగేష్కర్‌ , కాశి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్‌, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బంతు రాజేంద్రప్రసాద్‌ , అయినవిల్లి దేవస్థానం చైర్మన్‌ గుత్తుల నాగబాబు, వైస్‌ బయ్య చిన్నబాబు,జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు మిందగుదుటి శిరీష్‌, జి సి ఎస్‌ ఇంచార్జ్‌ పులిదిండి ప్రభాకర్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు మేడిశెట్టి రాజా, మిందగుదిటి రాంబాబు, వేటుకూరి సుబ్బరాజు,తాటిపాక జోషి కుమార్‌, కోరపు రవి, మొగలి పోతురాజు మరియు పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు