Nov 15,2023 22:15

ప్రజాశక్తి -పిఎం పాలెం (విశాఖ):విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఎసిఎా విడిసిఎ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 23న నిర్వహించనున్న ఇండియాా ఆస్ట్రేలియా టి-20 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ కోసం బుధవారం ఉదయం 11 గంటల నుంచి పేటిఎం  లింక్‌ insider.in ద్వారా ఆన్‌లైన్‌లో ఏడు వేల టికెట్లు విక్రయించామని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎసిఎ) కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం కూడా మరో ఏడు వేల టికెట్లను అన్‌లైన్‌లో విక్రయిస్తామని తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పిఎం.పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఎసిఎావిడిసిఎ క్రికెట్‌ స్టేడియంలోని 'బి' గ్రౌండ్‌, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో 22వ తేదీ వరకు, విశాఖపట్నం పిఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఎసిఎావిడిసిఎ క్రికెట్‌ స్టేడియంలోని 'బి' గ్రౌండ్‌లోని కౌంటర్‌లో 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చని తెలిపారు.