
హైదరాబాద్: వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ పరీక్ష ఫీజును పెంచాలని నిర్ణయించినట్టు తెలంగాణ రవాణాశాఖ ప్రకటించింది. ఇక నుంచి వాహనాన్ని పరీక్షించి సర్టిఫికెట్ను జారీ చేసేందుకు ద్విచక్రవాహనానికి రూ.50, పెట్రోల్ త్రీవీలర్స్కు రూ.60, పెట్రోల్ కార్లకు రూ.75, డీజిల్ కార్లకు రూ.100, డీజిల్లో ఇతర కేటగిరీ వాహనాలన్నింటికీ రూ.100 చొప్పున ఫీజు వసూలు చేయనున్నట్టు రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణాశాఖ జీవో నెం.23ను విడుదల చేసింది. ప్రస్తుతం ఏడేళ్లక్రితం ఉన్న ఛార్జీలనే అమలు చేస్తున్నారని, ఈ ఏడేళ్లలో వేతనాలు, ఇతర వ్యయాలు పెరిగాయని.. అందుకే పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.