Nov 10,2023 08:15

ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : మద్దికేర మండల కేంద్రంలో డి.పి.ఏ.పి కళ్యాణ మండపం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో హనుమప్ప సంస్కరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ ... గత 30 సంవత్సరాలుగా ఆయన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సిపిఐలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మండల కార్యదర్శిగా కొనసాగిన 9 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలకు సిద్ధమై ప్రజా సమస్యలు పరిష్కరించేవారని అన్నారు. పేదలకు ఇంటి స్థలాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటాలు చేశారని తెలిపారు. వ్యవసాయ కూలీలు రైతు సమస్యల పై నిరంతరం శ్రమిస్తూ పట్టుదలతో అధికారులు సైతం భాగస్వాములను చేసి పరిష్కరించే వారని అన్నారు. ఆయన లేని లోటు భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా భావిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు టిడిపి, వైసిపి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.