Oct 13,2023 21:30

న్యూఢిల్లీ : బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దశలో ఉన్నాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం 13వ రౌండ్‌ చర్చలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమైన 26 చాప్టర్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా మిగిలిన అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 20 బిలియన్‌ డాలర్ల పైగా ఉంది.