Dec 20,2022 21:30

హైదరాబాద్‌ : కృత్రిమ మేధా (ఎఐ) ద్వారా వ్యవసాయ భూముల డిజిటైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్లు గూగుల్‌ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నట్లు పేర్కొంది. భారత్‌ డిజిటల్‌ దత్తత దశ మార్పునకు మంగళవారం ఎఐ ఫర్‌ ఇండియా పేరుతో కొత్త ఏకీకృత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఇంటర్నెట్‌లో భాషాపరమైన సమస్యలను పరిష్కరించడం, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో వ్యవసాయ భూముల డిజిటలైజేషన్‌కు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యాలని పేర్కొంది. కెమెరా, వాయిస్‌ ఉపయోగించి కొత్త శోధన సామర్థ్యాలపై దఅష్టి పెడుతున్నట్లు పేర్కొంది. గూగుల్‌ పేలో సురక్షితమైన డిజిటల్‌ చెల్లింపుల కోసం.. మోసాలను గుర్తించే సరికొత్త నమూనాను అభివృద్థి చేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యమైన డిజిటల్‌ డాక్యుమెంట్లను ప్రయివేటుగా సురక్షితంగా, సులభంగా యాక్సెస్‌ చేసుకోవడానికి ఆండ్రాయిడ్‌పై గూగుల్‌ యాప్‌ ద్వారా ఫైళ్లలో డిజిలాకర్‌తో ఇంటిగ్రేషన్‌ కూడా తీసుకొస్తోన్నట్లు పేర్కొంది.
''వివిధ రంగాలలో పరివర్తన ప్రభావాన్ని నడిపించడానికి ప్రభుత్వాలకు ఎఐ ఒక శక్తివంతమైన సాధనం. ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూనే వ్యవసాయానికి ఆర్థిక సహకారాన్ని పెంచడానికి మేము ఎఐని సమర్థంగా ఉపయోగించాలనుకుంటున్నాము. గూగుల్‌తో మా సహకారం క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పరిష్కారాలను ఎనేబుల్‌ చేయడంలో, ఆ డేటాను విస్తఅత పర్యావరణ వ్యవస్థతో పంచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా వాల్యూ చైన్‌ అంతటా పాల్గనేవారు దీనివల్ల ప్రయోజనం పొందుతారు'' అని తెలంగాణ రాష్ట్ర ఎమర్జింగ్‌ టెక్నాలజీ విభాగం డైరెక్టర్‌ రమాదేవి పేర్కొన్నారు.