
ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : మద్దికేర మండల కేంద్రంలోని కుమ్మురమ్మబావి కాలనీవాసులు ఓ ప్రజాప్రతినిధిని అడ్డుకున్నారు. ఆ బావి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. గతంలో బావి బూంచి వేసి అక్కడ నాగలకట్ట నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు నియోజకవర్గ ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చాకచక్యంగా పనులు పూర్తి చేయడం జరిగింది. ఓ ప్రజా ప్రతినిధి నాగలకట్ట నిర్మించుకోకుండా తన సొంత నిధులతో బావి చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమనించిన కాలనీవాసులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్లి పనులు అడ్డుకోవడం జరిగింది. ఆ ప్రజా ప్రతినిధి కట్టిన గోడను గురువారం కూల్చివేశారు. కాలనీవాసులు గతంలో అనుకున్న మాదిరిగానే నాగుల కట్ట నిర్మాణం చేపట్టడానికి సంసిద్ధులయ్యారు.