Jul 24,2023 11:09

అమరావతి : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సోమవారం తాడేపల్లి నుండి గుంటూరు జిల్లా పర్యటనకు సిఎం వైఎస్‌.జగన్‌ బయలుదేరారు. కృష్ణాయపాలెంకు చేరుకొని లేఅవుట్‌లోని పైలాన్‌ను ఆవిష్కరించారు. వన మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి మొక్కలను నాటారు. అనంతరం పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆర్కే, ఎంపి నందిగం సురేశ్‌, ఎంపి సత్యవతి, ఆదిమూలపు సురేష్‌ ప్రసంగించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను సిఎం జగన్‌ అందజేశారు. మోడల్‌ హౌజ్‌ను పరిశీలించారు. ఆ తరువాత కఅష్ణాయపాలెం నుంచి వెంకటపాలెంకు ముఖ్యమంత్రి బయలుదేరారు. అక్కడి బహిరంగ సభలో సిఎం జగన్‌ ప్రసంగించిన అనంతరం లబ్దిదారులకు ఇళ్ల మంజూరు పట్టాలను అందజేయనున్నారు.