Nov 20,2023 13:05

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : 20.11.23 మండల పరిధిలోని మాలవడ్లపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మూగే తిమ్మంపల్లి గ్రామనికి చెందిన ఒక మహిళ అదృశ్యం అయినట్లు నార్పల పొలీస్‌ స్టేషన్‌లో శనివారం రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి నార్పల పోలీసులను రెండు బృందాలుగా ఏర్పాటు చేసి అదృశ్యమైన ఇద్దరు మహిళలను వారు ఉన్న ప్రదేశాలను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని 24 గంటల్లోనే ఆ కేసులను ఛేదించి వారి వారి కుటుంబ సభ్యులకు మహిళలను అప్పగించారు. దీనితో పోలీసుల పనితీరును పలువురు ప్రశంసించారు.