
హైదరాబాద్ : బహుజన సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్ బీఎస్పీ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రవీణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. అనంతరం అతని ఇంటికి తరలించారు.
ఖబడ్దార్ కెసిఆర్ : ప్రవీణ్ కుమార్ ట్వీట్
ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. '' మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదు. ఖబడ్దార్ కెసిఆర్. పేపర్ లీకులకు మీ కుటుంబానికి సంబంధం ఉంది. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నది మీ ఏజెంట్లే. ఇది సిబిఐ దర్యాప్తు ద్వారానే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. తెలంగాణ సమాజమంతా గమనించాలి '' అని ట్వీట్లో పేర్కొన్నారు.