
ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, సోకకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని స్నేహ హోమియో ఆయుర్వేదిక్ క్లినిక్ డాక్టర్ సోమశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆదోని పట్టణంలోని బిఎన్ టాకీస్ రోడ్డులో క్లినిక్ ముందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్టిక్, ఆయాసం, ఆస్తమా ఇతర వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమశేఖర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తికి దోమ కాటు కారణమన్నారు. దోమలు వఅద్ధి కాకుండా మురుగు కాలువలు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చెల్లించుకోవాలన్నారు. ప్రతిరోజు కాచి వడపోసిన నీటిని తాగాలన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే విధంగా సమతుల్య ఆహారము తీసుకోవాలన్నారు. ముందుగానే ఆయుర్వేదిక్ మందులు వాడడం వల్ల సీజనల్ వ్యాధుల బారి నుండి కాపాడుకోవచ్చన్నారు. ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ తమ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రతి సీజన్ లో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని వివరించారు. ఈ క్యాంపులో సుమారుగా 150 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు.