Sep 16,2023 18:42

నాగర్‌కర్నూల్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను ఓ తల్లి కాల్వలో పడేసింది. ఈ ఘటనలో చిన్నారులు మహాలక్ష్మి (5), చరిత (4), మంజుల (3) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 7 నెలల బాలుడు మార్కండేయ ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.