Oct 20,2023 21:07

న్యూడిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్తల సంఘం అసోచామ్‌ తన 18వ వార్షిక బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సెక్టార్‌ లెండింగ్‌ సదస్సు అండ్‌ అవార్డుల కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్‌కు మూడు అవార్డులు దక్కాయి. బ్యాంక్‌ మిడ్‌ సైజ్‌ బ్యాంక్‌ విభాగంలో ''బెస్ట్‌ డిజిటల్‌ ఇనిషియేటివ్స్‌''లో విజేతగా మరియు ''బెస్ట్‌ రిస్క్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్‌'', ''బెస్ట్‌ ప్రొడక్ట్‌/సర్వీస్‌ ఇన్నోవేషన్‌''లో అవార్డులు అందుకున్నట్లు ఐడిబిఐ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ అవార్డులను రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌, అసోచామ్‌ అధ్యక్షుడు జి రాజ్‌కిరణ్‌ రారు సమక్షంలో ఆర్‌బిఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజరు కుమార్‌ చౌదరి నుంచి ఐడిబిఐ బ్యాంక్‌ డిఎండి సురేష్‌ ఖతన్‌హర్‌కు అందజేశారని తెలిపింది.