న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఫిలిప్స్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 4వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించింది. గడిచిన జులై- సెప్టెంబర్ కాలంలో కంపెనీ అమ్మకాలు 5 శాతం తగ్గి 4.3 బిలియన్ యూరోలకు పరిమితం కావడానికి తోడు, కంపెనీలో పొదుపు చర్యల నేపథ్యంలో సిబ్బందిని తొలగించాలని నిర్ణయించినట్లు ఆ కంపెనీ సిఇఒ రారు జాకోబ్స్ పేర్కొన్నారు.










