Apr 17,2023 21:19
  • పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌

బ్రెసిలియ(బ్రెజిల్‌): ఇక్కడ జరుగుతున్న పారా బాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల డబుల్స్‌ జోడీ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో పారా ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌(ఎస్‌ఎల్‌ా3)-సుకాంత్‌ కదమ్‌(ఎస్‌ఎల్‌-4) జోడీ 22-20, 21-19తో కొరియాకు చెందిన జో డోంగీ-షిన్‌ క్యుంగ్‌లపై గెలిచారు. ఇక సింగిల్స్‌లో ప్రమోద్‌(ఎస్‌ఎల్‌-3)లో ఫైనల్లో 12-21, 13-21తో భారత్‌కే చెందిన నితేష్‌ చేతిలో ఓడి రజిత పతకానికే పరిమితమయ్యాడు.