అర్హులను షిఫ్ట్ ఆపరేటర్లగా తీసుకోవాలి : యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్
విజయవాడ : విద్యుత్ శాఖ లోని సబ్ స్టేషన్ ల వద్ద వాచ్ మెన్ లను షిఫ్ట్ ఆపరేటర్ లుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం అలంకార్ సెంటర్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నా ను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర నాయకులు, కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎవి.నాగేశ్వరరావు మాట్లాడారు. ఐటిఐ చేసిన వారిని, అర్హత ఉన్నవారిని షిఫ్ట్ ఆపరేటర్ గా తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యుత్ శాఖ లోని సబ్ స్టేషన్ ల వద్ద వాచ్ మెన్ లను షిఫ్ట్ ఆపరేటర్ లుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.