Nov 15,2023 14:27

అమరావతి: మద్యం కేసులో మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేసినట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.గత ప్రభుత్వ హయంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలతో.. సీఐడీ అధికారులు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. కొల్లు రవీంద్ర బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దురుద్దేశపూర్వకంగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెడుతోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.